Sunday, November 14, 2010

రాజకీయ రారాజు దండు

 
పేద కుటుంబంలో పుట్టి శ్రమను, ప్రతిభను నమ్ముకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్న త శిఖరాన్ని అందుకున్న నిరంతర శ్రామికుడు, మాజీ మంత్రి దండు శివరామరాజు ఇక లేరన్న విషయాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ అతి నిరాడంబరంగా అందరి ఆత్మీయుడుగా పేరొందిన శివరామరాజు జిల్లా రాజకీయాల్లో రారాజుగా వెలుగొందారు. నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడుతూ మ చ్చలేని రాజకీయ నాయకుడిగా పేరుగాంచారు.

ఆదివారం నిడమర్రు మండలం మందలపర్రులోని తన స్వగృహంలో తుది శ్వాస విడవడంతో జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లాలోని రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు దండు మృతికి తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు,కార్యకర్తలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

పేద కుటుంబంలో పుట్టి..
జిల్లా రాజకీయాల్లో 1936,జూలై14న పెనుమంట్ర మండలం పొలమూరులో పేద కుటుంబంలో పుట్టి డ్రిల్ మాస్టారుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి రెండు సార్లు ఎమ్మెల్సీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గణపవరంలోని చింతలపాటి బాపిరాజు విద్యాసంస్థల్లో పీఈటీగా పనిచేస్తూనే కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1974లో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయనియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 1984వరకు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1989లో అత్తిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మాజీ మంత్రి యిందుకూరి రామకృష్ణంరాజు(కాంగ్రెస్)పై 1111ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై ఓటమి చవి చూసినా పార్టీని వెన్నంటి ఉండి 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డాల స్వామినాయుడుపై సుమారు 55వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 1999లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి నూకారపు సూర్యప్రకాశ్‌పై మూడవసారి విజయం సాధించి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ,ధర్మాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేవాదాయ శాఖలో ఉన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ దేవాలయాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలోఅత్తిలి నియోజకవర్గం రద్దు ఆయ్యింది. దీంతో అత్తిలి నియోజకవర్గంనుంచి చివరి మంత్రిగా దండు రికార్డుకెక్కారు. అనారోగ్యం బారిన పడిన తరువాత తన ఆస్తిలో కొంతభాగాన్ని దేవాలయాలకు తనను నమ్ముకున్న సన్నిహితులకు దానం చేశారు.

జిల్లా పార్టీ అధ్యక్షునిగా
1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దండు 1995లో జిలా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి పార్టీ పటిష్టతకు కృషి చేయడమేకాకుండా జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేగాక తన సొంత నియోజకవర్గం అత్తిలిలోను పార్టీకి సొంత కార్యాలయ భవనం నిర్మించి ఔరా అనిపించుకున్నారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తునే 2004లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకువాడ శ్రీరంగనాధరాజుపై స్వల్ప తేడాతోఓటమి చవిచూశారు మూడు ఏళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. తదుపరి అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు.

దేవాలయాల ఆదాయం పెంచిన ఘనుడు
రాష్ట్రంలో దేవాదాయ భూముల కౌలుదారుల చట్టంలో మార్పులుతీసుకువచ్చిన ఘనత మంత్రిదండుదే. మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు రాష్ట్రంలో దేవాలయాలకు 2.68లక్షల ఎకరాలనుంచి రూ.18 కోట్ల ఆదాయం లభించేది. సుప్రీంకోర్టు నుంచి కౌలుదారుచట్టంలో మార్పులు తీసుకురావడతంతో ఆదాయాన్ని గణనీయంగా సుమారుగా రూ. 500కోట్లకు పెంచగలిగారు. ఈయన హయాంలో గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించగలిగారు. దేవాలయాల్లో వసతి సౌకర్యాల కల్పనకు కృషిచేస్తూనే అవినీతి ప్రక్షాళనకు నడుం బిగించి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలతిరుపతి దేవస్థానంలోకి మారువేషంలో వెళ్లి అక్కడ క్షౌరశాలల్లో జరుగుతున్న అవినీతిని ఎండ గట్టారు. అత్తిలి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.

'దేవుడు ' రాజు ఇక లేరు!

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని పొలమూరులో 1936లో దండు వెంకట్రాజు, సుభ్రదమ్మ దంపతులకు శివరామరాజు జన్మించారు. అదే గ్రామంలో ఎస్ఎస్ఎల్‌సీ వరకు చదివారు. 1966లో పిప్పర గ్రామానికి చెందిన అరుణ ప్రభను వివాహం చేసుకున్నారు. దండు శివరామరాజు సతీమణి ఆరుణప్రభతో ఆయన నిడమర్రు మండలం మందలపర్రులో స్థిిరనివాసం ఏర్పరచుకున్నారు.

సంతానం లేని దండు అవినీతికి పాల్పడి సంపాదించాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. శివరామరా జు వ్యవసాయం చేయించడమంటే ఆ సక్తి చూపేవారు. శివరామరాజు తండ్రి నిరక్షరాస్యుడు కావడంతో తనను బా గా చదివించాలని, మంచి ఉద్యోగస్తుడుగా చూడాలని తన తండ్రి భావించేవారని రాష్ట్ర మంత్రి కావడం ద్వారా ఆయన కోర్కె తీర్చానని దండు చెబు తూ ఉండేవారు.

చిన్నతనం నుంచి వి ద్యాభ్యాసంతో పాటు క్రీడలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ.ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో బతుకుతెరువు కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌కు వెళ్ళి పిీఈటీ ఉద్యోగం సంపాదించా రు. కబడ్డీ, షాట్‌పుట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లాంటి క్రీడల్లో ప్రావీణ్యం ఉండేదని, అదే స్ఫూర్తితో డ్రిల్‌మాస్టర్ అయ్యానని నేటికి చెబుతూ ఉండేవారు.1968లో పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో పనిచేసేటప్పుడు బాపిరాజు ధర్మసంస్థలో కార్యదర్శిగా పనిచేశారు. మూర్తిరాజు వ్యవస్థాపకులుగా ఉన్న ఈ సంస్థ ఆధ్వర్యంలో 18 విద్యాసంస్థలు ఉండేవి. దీనికి శివరామరాజు కార్యదర్శిగా వ్యవహరించారు.

ఉపాధ్యాయులకు మాత్రమే సేవచేస్తున్న తాను ఇంకా విస్తృతంగా సామాన్య ప్రజలకు బడుగు, బలహీన వర్గాలకు సేవలందించాలనే తపనతో రాజకీయంలోకి వచ్చానని అంటుండేవారు. అప్పట్లో అత్తిలిని కుప్పం నియోజకవర్గం తరహాలో అభివృద్ధి చేయాలని తలంపు పెట్టుకునేవాడినని దండు చె బుతుండేవారు. తీరిక దొరికితే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. వ్యవసాయానికి ప్రస్తుత ఆ«ధునిక వి ధానాలు మరింత ప్రోత్సహకరంగా ఉన్నాయని ఆయన అంటుండేవారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా తూర్పుగోదావరిజిల్లాలో ఎక్కువ కాలంపనిచేశారు. అనపర్తి, అమలాపురం, కోమరగిరిపట్నం పాఠశాలల్లో పీఈటీగా పనిచేశారు.

ప్రముఖ విద్యాసంస్థ బాపిరాజు ధర్మసంస్థ్దకు కార్యదర్శిగా పనిచేసిన దండు శివరామరాజు 1974శాసనసభ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లా నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో 1982లో కూడా పోటీచేసి రెండవసారి కూడా ఎ మ్మెల్సీగా విజయం సాధించారు. ఉపాధ్యాయుల సమస్యలపైనా, విద్యారంగ సమస్యలపైనా చట్ట సభలో ఆయన పోరాడుతూ ఉండేవారు. తన వాగ్ధాటితో, సమస్యలపై స్పందించే తీరు అందరినీ అకట్టుకునేది.

ఇలా ఆ రోజుల్లోనే ఆయన చట్ట సభల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ మక్కువతోనే 2005లో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత మరోమారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. రాజకీయ ఉద్దండులైన మాజీ మంత్రి సర్వోదయ నా యకులు చింతలపాటిమూర్తి రాజు, అప్పటి అత్తిలి ఎమ్మెల్యే, దివంగత వేగే శ్న కనకరాజు, కింగ్‌మేకర్‌గా ఈడూరి సూర్పరాజు తమకు స్ఫూర్తి ప్రధాతల ని దండు చెబుతుంటారు.

1984లో ఎన్.టి.ఆర్. పిలుపుమేరకు దండు టీ డీపీలో చేరారు. తొలిసారిగా 1989లో అత్తిలి నుంచి టీడీపీ అభ్యర్థ్దిగా పోటీచేసి గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించడమే కాకుండా 1989, 94 సంవత్సరాల మధ్య అసెంబ్లీలో పార్టీవిప్‌గా పనిచేశారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై 2వ సారి అసెంబ్లీలో ప్రవేశించారు. 1999 శాసనసభ ఎన్నికల్లో అత్తిలి నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖకు కేబినెట్ మంత్రి అయ్యారు.

వ్యక్తిగతంగా కోపిష్టిగా కనబడే దండు కోపం వచ్చినా కేకలు వేసినా మరుక్షణం పాలపొంగులా కోపం కరిగిపోతుందని ఆయన అనుచరులు, అభిమానులు చెబుతుంటారు. అప్పట్లో పనిచేయని అధికారులు నిలదీయడం, దులిపివేయడం ఆయన నైజం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తునిగా మారు వేషంలో వెళ్లి అక్కడ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

పదవిలో ఉన్నా లేకపోయినా గ్రామగ్రామాన తిరగడం, కార్యకర్తలను ప్రజలను కలుసుకోవడం అతని విలక్షణ శైలి.మోటర్‌సైకిల్, సైకిల్, పాదయాత్ర సంస్కృతిని దండు ప్రవేశపెట్టారంటే అతిశయోక్తికాదు.అలాగే దేవాదాయ శాఖా మంత్రిగా రైతువారి చట్టం నుంచి దేవాదాయ భూముల మినహాయింపుచట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఆయన ప్రవేశపెట్టారు.దేవాదాయ భూములు అన్యక్రాంతంకాకుండా పటిష్టపర్చడానికిఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకడుగు వేసేవారు కాదు.దాతల ఆశయాల మేరకు ఇచ్చి న భూములను కాపడటానికి రాజీపడే ప్రశక్తిలేదని,ఇందుకోసం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆస్తులను పరిరక్షించేందుకు జీవో తీసుకువచ్చారు.

సేధ్యానికి పనికిరాని భూములు అవసరమైతే అ మ్మి ఆసొమ్ము దేవాలయాల పేరున ఫి క్సిడ్ డిపాజిట్‌చేసి భగవంతునికి ధూ ప, దీపనైవేద్యాలకు ఏర్పాటు చేశారు. గతంలో దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ముస్లింకు షాదీకనాలు, క్రైస్తువులకు చర్చిలు, హిందూ దేవాలయాల అభివృద్ధ్దికి సమర్థవంతంగా పనిచేసిన గుర్తింపు తెచ్చుకున్నారు.పెంటపాడు, మార్టేరు స్టేట్ హైవే నిర్మాణానికి రూ.32కోట్లు మంజూరుచేయించారు. స్వజలధార, డ్వాక్రా గ్రూపులు, నియోజకవర్గంలో 200సాముహికమరుగుదొడ్లను అధునాతన సాంకేతిక ప రిజ్ఞానంతో నిర్మించి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

రైతు సోదరులకు సౌకర్యంగా ఉండేందుకు కోమర్రు రూ.కోటి 20లక్షలతో యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెన నిర్మించారు.అలాగే పిప్పర వద్ద యనమదుర్రు డ్రెయిన్‌పై కూడా నూతన వంతెన నిర్మాణానికి కృషిచేశారు.నియోజకవర్గంలో కట్టవపాడు, గణపవరం, కోముట్లపాలెం, వాకపల్లి తదితర గ్రామాల్లో ఫుట్‌పాత్ వంతెలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకున్నారు. డ్రిల్‌మాస్టర్‌గా స్కూల్‌పిల్లలను బెత్తంతో అదిరిస్తూ పిరియడ్‌చేయించి డ్రిల్‌చేయించడం ఆయన వృత్తి. అయితే హైదరాబాద్‌లో జరిగిన మహానాడులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ దండుశివరామరాజు చేత డ్రిల్‌మాస్టర్ తరహలో విజిల్ ఊదు తూ చేతితో బెత్తం పట్టుకుని కార్యకర్తలకు క్రమశిక్షణతో రాజకీయ డ్రిల్‌చేయించే బాధ్యతను అప్పగించారు.

శివరామరాజు స్వార్జిత ఆస్తులను, రూ.2కోట్లు విలువచేసే 11ఎకరాల భూములను ధార్మిక సంస్థ్దలకు ధానధర్మం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులను సంబంధిత వారికి అందించారు.తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు వీరాభిమానం. అందుకే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన ఎకరం భూమిని రాసిఇచ్చారు. శివరామరాజు అధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలుచేయడం ముందుండి పనిచేసేవారు.అలాగే ఎమ్మెల్సీగా పనిచేసిన రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.జనార్దన్‌రెడ్డి ద్వారా రూ.కోటి30లక్షలు తీసుకువచ్చి రైతుల సంక్షేమానికి వెంకయ్యవయ్యోరు మరమ్మతులు చేపట్టారు.అప్పట్లో తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అప్పటి ప్రధానీ విపి సింగ్‌ను కలిసి పంటల బీమా, నష్టపరిహరం తీసుకువచ్చి రైతు బాంధవుడిగా గుర్తుతెచ్చుకున్నారనడంలో అతిశయోక్తిలేదు.

ఆయన దేవాదాయ మంత్రిగా ఉన్నరోజుల్లో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రూ.25కోట్లతో అన్నిదేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది పుష్కరాలను విజయవంతం చేయడంలో ఆయనకృషిచేశారు. అవి ఇప్పటికి మరుపురాని స్మతులుగా గుర్తుండిపోయాయి. శివరామరాజు బడుగు, బలహీన వర్గాలకే గుర్తింపుతెచ్చుకున్న వ్యక్తి. ప్రజలు నేటికి మరువలేరని బలహీనవర్గాలతో పాటు దళిత, బిసి మహిళలతో దండు సేవల పట్టానేటికి మరువలేకపోతున్నారు. ఆయన భౌతికంగా మన మధ్యలేకున్నా చిత్తశుద్ధి అతని సేవలు చెరగని జ్ఞాపకాలు.

మాజీ దేవాదాయ మంత్రి శివరామరాజు కన్నుమూత
ఊపిరితిత్తుల కేన్సర్‌తో కొంతకాలంగా నిమ్స్‌లో చికిత్స
తన యావదాస్తి దానం చేసిన దండు

రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి దండు శివరామరాజు (74) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యపరిస్థితి చేజారిపోవడంతో ఆదివారం ఆంబులెన్స్‌లో ఆయనను పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని స్వగ్రామం మందలపర్రుకు తీసుకొచ్చిన గంటలోపే తుదిశ్వాస విడిచారు.

శివరామరాజుకు భార్య ఉన్నారు. సంతానం లేదు. ఆయన తన యావదాస్తిని మిత్రులకు, సన్నిహితులకు, పలు దేవాలయాలకు, అత్తిలిలోని టీడీపీ కార్యాలయానికి, సుబ్రహ్మణ్యేశ్వస్వామి దేవాలయానికి దానం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన కాలంలో సామాన్య భక్తునిలాగా మారువేషంలో తిరుమల వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

అలాగే రైతువారి చట్టం నుంచి దేవాదాయ భూముల మినహాయింపు చట్టాన్ని ప్రవేశపెట్టారు. సేద్యానికి పనికిరాని భూములు అమ్మి, ఆ సొమ్మును దేవాలయాల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేసి భగవంతునికి ధూప, దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన శివరామరాజు కలత చెంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

సీఎం సంతాపం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దండు శివరామరాజు మృతిపట్ల సీఎం రోశయ్య విచారం వ్యక్తం చేశారు.

ఆయన సేవలు మరువలేనివి: చంద్రబాబు
మాజీ మంత్రి దండు శివరామరాజు సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి...:మాజీ మంత్రి ఉమ్మారెడ్డి
ఉన్నత విలువలు పాటించిన ఆదర్శ వ్యక్తి దండు అని టీడీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు.

'దండు'కు టీడీపీ నేతల ఘననివాళులు
టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, వర్ల రామయ్య, తొండపి దశరథ జనార్ధన్, పీఆర్ మోహన్, బాలసాని లక్ష్మీ నారాయణ, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.

సమాజ అభివృద్ధికి శివరామరాజు తపన పడేవారు: కంతేటి
మాజీ మంత్రి దండు శివరామరాజు సమాజ అభివృద్ధి కోసమే నిరంతరం తపన పడేవారని, ఆయన మృతి రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు అన్నారు. తామిద్దరమూ మూర్తిరాజు శిష్యులమని, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు.

మాజీ మంత్రి 'దండు' మృతికి పలుపురి నివాళి

మాజీ మంత్రి దండు శివరామరాజు చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్వగ్రామమైన పెనుమంట్ర మండలం పొలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొలమూరులో జన్మించిన శివరామరాజు అక్కడే విద్యనభ్యసించి మూర్తిరాజు విద్యాలయాల్లో వ్యాయమోపాద్యాయుడిగా ఉద్యోగం చేపట్టిన దండు శివరామరాజు విద్యార్థి దశ నుంచి నాయకత్వం లక్షణాలు కలి గి సంపూర్ణ నాయకునిగా ఎదిగారు.

రాజకీయ దురంధరుడు, చిరునవ్వుల దండు శివరామరాజు మృతితెలుగుదేశం పార్టీకి తీరని లోటనీ పెనుమంట్ర టీడీపీ మండల అధ్యక్ష్య, కార్యదర్శులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, వీరవల్లి శ్రీధర్, గాంది, కోయ నాగపోరాజు, కలిదిండి మహేష్‌రాజు, పెచ్చె ట్టి ఏడుకొండలు, పెనుగొండ అరుణప్రసాద్, మాజీ ఎంపీపీ తమనంపూడి కమలకుమారి, మండల టీడీపీ మహి ళా అధ్యక్షురాలు కడలి సత్యవాణి, వెలగల బుల్లిరామిరెడ్డి తదితరులు దండు శివరామరాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి దండు శివరామరాజు మృతికి వివిధ పార్టీ నేతలు ఆదివారం మందలపర్రులోని ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, పాలకొల్లు మాజీ శాసనసభ్యులు పత్సవత్సల బాబ్జి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోటసీతారామలక్ష్మీ, మాజీ రాజ్యసభ సభ్యు లు యర్రానారాయణస్వామి, మెంటే పద్మనాభం, ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఇందుకూరిరామకృష్ణంరాజు, దేవాదాయ రిటైర్డ్ డీసీ లు రామాంజనేయరాజు, ఆనందస్వరూప్‌వర్మ, వి.నరసింహరాజు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.ఎస్.రాజు, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మెంటే పార్దసారధి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధా న కార్యదర్శి నాయుడు రామచంద్రరరావు, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ గన్నివీరాంజనేయులు, జిల్లా సమన్వయ కార్యదర్శి నంద్యాల మదన్‌మోహన్‌లచ్చిరాజు, గణపవరం మండల పార్టీ అధ్యక్షులు నాయుడు శ్రీనివాసరావు,

కార్యదర్శి యాళ్ళసుబ్బారావు, ప్రచారకార్యదర్శి కూనసాని నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు జూ పల్లి రాజేంద్ర, ముద్రగడ మునియ్య, సంకు శ్రీనివాసరావు, నిడమర్రు ఎంపిీపీ అంబళ్ళ వెంకటేశ్వరరావు, పోసింశెట్టి రామమూర్తి, టీడీపీ నాయకులు సంకుపుల్లారావు, పీఆర్పీ నాయకులు పుప్పాలరామయ్య, కాంగ్రెస్ నాయకు లు గుడాల భుజంగరావు, గణపవరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కూసంపూడి జగపతిరాజు, జిల్లాకాంగ్రెస్‌కార్యదర్శి నంద్యాల రామలింగరాజు, కాంగ్రెస్ నేతలు మాదిరెడ్డి సురేష్‌కుమార్, గాదిరాజు గోపాలకృష్ణరాజు, గాదిరాజు గోపాలరాజు, గాదిరాజు సుదర్శనవర్మ, గణపవరం తహసీల్దార్ ఆశీర్వాదం, ఎంఈవో సాగిరాజు పెద్దిరాజు, వీఆర్వో నాగయ్య పరిసర గ్రామాల ప్రజలు వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

సినీ దిగ్గజం పద్మశ్రీ డీవీఎస్ రాజు

 

సినీ భీష్మ ఇకలేరు

నిస్వార్ధ సేవ, అంకితభావం కలిగిన వారు ఏ రంగంలోనైనా రాణించి గుర్తింపు తెచ్చుకుంటారనడానికి మంచి నిదర్శనం డి.వి.ఎస్.రాజు. ఆవేశానికి, ఉద్రేకానికి లోనుకాకుండా, వర్గాలకు, వైషమ్యాలకూ దూరంగా ఉండే వ్యక్తులు డి.వి.ఎస్.రాజులా కొందరే ఉంటారు. అందుకే ఆయన అజాత శత్రువు అనిపించుకున్నారు.గ్లామర్‌కు నిలయమైన చిత్రపరిశ్రమలో మచ్చలేని స్వచ్ఛమైన జీవితాన్ని గడిపిన అరుదైన వ్యక్తి డి.వి.ఎస్.రాజు.

అందుకే చిత్రపరిశ్రమలో ఆయనకున్న స్థానం ప్రత్యేకమైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. అది వ్యక్తిగతమైనా, సంస్థాగతమైందైనా దాన్ని పరిష్కరించుకోవడానికి డి.వి.ఎస్.రాజు సహాయాన్ని, సహకారాన్ని కోరడం, ఆయన దాన్ని పరిష్కరించడం పరిశ్రమలో ఓ ఆనవాయితీ అయింది.ఈ సేవాదృక్పథం తన తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. ఆయన పెద్దమనిషితనం అందరికీ ఓ తరగని కొండ. మరి ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో ఆ లోటుని భర్తీ చేయడం కష్టమేనని ఆవేదనతో అంగీకరిస్తున్నారు చిత్ర ప్రముఖులు.

వ్యక్తిగా ఆయన ఎంతో సౌమ్యులు. ఆయన చిరాకు పడటం కానీ, కోపగించుకోవడం కానీ ఎవరూ ఎరుగరు. పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎంతో ఓపికగా ఆయన పాల్గొనేవారు. ముఖ్యంగా చర్చల్లో, సంప్రదింపుల్లో ఆయన అనుసరించే వైఖరి ఇతరులకు ఆదర్శంగా ఉండేది. ఎదుటివారి వాదనని కూలంకషంగా వినడంలోనూ, తన వాదనను సవిమర్శకంగా వినిపించి, నచ్చచెప్పడంలోనూ ఆయనకున్న నేర్పు అసాధారణమైందని ఆయన సన్నిహితులు చెప్పేమాట.

ఏ పని ప్రారంభించినా క్రమశిక్షణతో, అంకితభావంతో కృషి చేసి విజయవంతంగా పూర్తి చేయగల కార్యదీక్షాదక్షుడిగా డి.వి.ఎస్.రాజు పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన మహానటుడు ఎన్.టి.ఆర్. కు అత్యంత సన్నిహితుడు కాగలిగారు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎన్.టి.ఆర్. నిర్వహించిన పలు కార్యక్రమాల్లో డి.వి.ఎస్.రాజు కీలక పాత్ర వహించేవారు.

.డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై 'మంగమ్మ శపథం' చిత్రంతో ప్రారంభించి తెలుగులో 18 చిత్రాలను, హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించారు. అలాగే భాగస్వాములతో కలిసి తెలుగులో 'మా బాబు', 'శ్రీకృష్ణాంజనేయ యుద్ధం', 'దేవుడులాంటి మనిషి' చిత్రాలను, తమిళంలో రెండు చిత్రాలను ఆయన నిర్మించారు. పరిశ్రమ కోసం, దాని అభివృద్ధి కోసం వెచ్చించిన సమయాన్ని కూడా చిత్రనిర్మాణరంగం మీదకు మళ్లించి ఉంటే ఆయన మరో పాతిక చిత్రాలు నిర్మించే ఉండేవారేమో. అయితే ఏ పరిశ్రమలో ఉన్నామో దాని అభివృద్దికి బాధ్యత వహించి కృషి చేయాలనే తపన ఆయనతో ఆ పని చేయించలేదు.

1965లో చలనచిత్ర పరిశ్రమ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు డి.వి.ఎస్.రాజు ముందుకు వచ్చి చిన్న నిర్మాతలను ఆదుకునేందుకు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియాను ఏర్పాటు చేసి స్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు. సినీ రంగంలో ఎలాంటి అవకతవకలు ఎదురైనా వాటిని చక్కదిద్దడంలో ఆయన ముందుండి పరిష్కరించేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1980లో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదే ఏడాది ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ సంస్థలను విలీనం చేసి నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో కేంద్రప్రభుత్వం ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి దాని తొలి ఛైర్మన్‌గా డి.వి.ఎస్.రాజుని నియమించినప్పుడు భారత చలనచిత్ర పరిశ్రమ ఎంతో హర్షించింది. దానికి తగ్గట్లుగానే చిత్ర పరిశ్రమలోని ఎన్నో జటిల సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో ఎన్.ఎఫ్.డి..సి. భాగస్వామ్యంలో 'గాంధీ' చిత్రాన్ని ఆంగ్ల, హిందీ భాషల్లో నిర్మించి దాని వల్ల వచ్చిన లాభాలను పరిశ్రమలోని వృద్ధ కళాకారులకు నెలసరి భత్యం చెల్లించడానికి వినియోగించారు. ఎన్.ఎఫ్.డి.సి.కి రెండోసారి కూడా ఛైర్మన్‌గా పనిచేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛెర్మన్‌గా రెండుసార్లు పనిచేసి తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్థికి ఎంతో కృషి చేశారు.

అలాగే దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నికకావడమే కాకుండా నాలుగు భాషలకు సంబంధించిన ఛాంబర్ కనుక అధ్యక్ష పదవి నాలుగు భాషల వారికి సమంగా రావడం ధర్మమని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన వారు ఒక్కో ఏడాది ఆ పదవిలో ఉండేలా నిబంధనలు మార్చి అందరికీ న్యాయం చేశారు డి.వి.ఎస్.రాజు. ఇలాంటి మంచి సంప్రదాయాలను ఎన్నో ప్రవేశపెట్టిన ఆయన్ని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి 1995లో 'భీష్మ' అవార్డ్‌తో ఘనంగా సత్కరించింది. నిర్మలత్వానికి, సేవాగుణానికి ప్రతీకగా నిలిచిన డి.విఎస్‌రాజు మరణం పరిశ్రమకి నిజంగా తీరని లోటే. 

సినీ దిగ్గజం పద్మశ్రీ  డీవీఎస్ రాజు

తెలుగు చలన చిత్ర రంగంలో డీవీఎస్.రాజు పేరు తెలియని వారు లేరు. నాలుగు దశాబ్దాలుగా భారత చిత్ర పరిశ్రమతో ఆయన అల్లుకుపోయారు. గులేబకావళి క«థ, గండికోట రహస్యం వంటి మహోజ్వల జానపద చిత్రాలు ఎన్నింటినో నిర్మించిన డీవీఎస్ రాజు శనివారం హైదరాబాదులో మృతి చెం దారు. ఆయన జ్ఞాపకాలు గోదావరి జిల్లా ప్రజలను వెంబడిస్తున్నాయి. రారాజుగా వెలుగొందిన డీవీఎస్.రాజు వివాద రహితుడిగా నిరాండంబరుడిగా పేరుపొందారు.

ఆయన పూర్తి పేరు దాట్ల వెం కట సూర్యనారాయణరాజు. ఆయన 1928లో జన్మించారు. ఆయన స్వగ్రా మం పోడూరు మండలం కవిటం. ఆయన తండ్రి దాట్ల బలరామరాజు, రాజకీయ దురంధరుడిగా పేరుపొందారు. 1962 నుంచి రెండు సార్లు నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి వారసత్వంతో చిన్నప్పుడే ప్రతిభను పుణికిపుచ్చుకున్నారు. కాకినాడ పీఆర్ కళాశాలలో చదువు పూర్తయ్యాక వ్యా పారం నిమిత్తం మద్రాసు వెళ్లి అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.

1950లో సినోలితో వర్క్స్ పేరుతో వా ల్‌పోస్టర్ ముద్రణ సంస్థను ప్రారంభించారు. పిచ్చి పుల్లయ్య సినిమా పోస్టర్ ముద్రణ సమయంలోనే ఎన్టీ రామరావుతో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో ఎన్‌టిఆర్ సోదరుడు త్రివిక్రమరావు ప్రారంభించిన ఎన్ఏటి సం స్థలో భాగస్వామి కావాలని కోరిన మీదట డీవీఎస్ రాజు అంగీకరించారు. ఆ బ్యానర్‌పై తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి వంటి చిత్రాలను నిర్మించారు. 1964లో తన సొంత సంస్థ డీవీఎస్ఎన్ ప్రొడక్షన్ ప్రారంభించారు. మంగ మ్మ శపధంతో జైత్రయాత్రను ప్రారంభించారు. గండికోట ర హస్యం, గులేబకావళిక«థ, తిక్క శంకరయ్య, మాబా బు, ధనమా దైవమా, పిడుగు రాము డు వంటి 25 చిత్రాలను నిర్మించారు. 1975లో జీవన జ్యోతి సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డుల పంట పం డించింది. ఆయన సినీ జీవితంలో ఎన్నో అనుభవాలు పరాజయాలను ఎదుర్కొన్నారు. 1966లో దక్షిణ భార త చలనచిత్ర మండలికి గౌరవ కార్యదర్శిగా పదేళ్లు పనిచేశారు.

1977లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కృషితోనే చలనచిత్ర మండలి ఏర్పడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, చిరంజీవీ వంటి ఎందరో ఈ మండలి ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారే. డీవీఎస్‌రాజు 1978లో ఫిల్మోత్సవం నిర్వహించి అ భినందనలు పొందారు. 1984-89 మధ్య ఏబీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండోసారి 1990లో ఎన్నికయారు. ఫిలిం డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ తొలి అధ్యక్షుడి గా పనిచేశారు. పేద కళాకారుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. 989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1995లో తమిళ పరిశ్రమ గ్రిష్మా పురస్కారం పొందారు. ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది.

రాష్ట్రపతి నారాయణన్, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయు డు, దగ్గుబాటి పురందరేశ్వరి చేతుల మీదుగా పలు అవార్డులు అందుకు న్నారు. పలు హోదాల్లో చలనచిత్ర రంగానికి, కళాకారులకు, సామాజిక సేవ కార్యక్రమాలకు సహకరించారు. ఆయన మరణం పశ్చిమ వాసులను కలచివేసింది. ఆయన 1989లో పాలకొల్లులో పాల్గొన్న వ్యక్తిగత కార్యక్రమాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తండ్రి బలరామరాజు పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అభివృద్దికి కారకుడు అయితే సినీ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా డీవీఎస్ రాజు వెలుగొందడం జిల్లాకు గర్వకారణం.

తెలుగు సినిమా భీష్ముడు ఇక లేడు !

అజాతశత్రువుకు అశ్రు నివాళి

 
dvs-raju5
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ నిర్మాత డీవీఎస్‌ రాజు కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. డీవీఎస్‌ రాజు 1928 డిసెంబర్‌ 13న తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించారు. 1950 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పటి మద్రాసు మహానగరంలో ‘సినీ లితో వర్క్‌‌స’ పేరుతో సినిమా పోస్టర్లు ముద్రించే సంస్థను స్థాపించారు. పోస్టర్లు ముద్రించే సమయంలో నందమూరి తారక రామారావుతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీంతో రాజు ఎన్‌ఏటీ సంస్థలో భాగస్వామిగా చేరి ‘జయసింహ’, ‘పాండురంగ మహత్యం’, ‘గులేబకావళి కథ’ వంటి పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

dvs-raju21959లో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 30 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది.1965లో ‘దక్షిణ భారత సినీ నిర్మాతల మండలి’ని స్థాపించి దశాబ్ద కాలం పాటు కార్యదర్శిగా సేవలందించారు. అంతేగాక అప్పట్లో మద్రాసులో ఆయన నెలకొల్పిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లోనే చిరంజీవి, రజనీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి ఎందరో హీరోలు నటనాభ్యాసం చేసారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలు నిర్మించి ఉన్నత స్థాయికి ఎదిగారు. తెలుగులో అనేక సినిమాలు నిర్మించి అవార్డులు అందుకు న్నారు.1988లో రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో మరియు 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతోనూ డీవీఎస్‌ రాజును సత్కరించాయి.

dvs-raju4 ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షునిగా మరియు నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెర్మన్‌గా పనిచేశారు. 1980లో ఎన్‌.ఎఫ్‌.డి.సి. ద్వారా మృణాల్‌సేన్‌, గౌతంఘోష్‌, శ్యాంబెనగల్‌, నిహలానీ వంటి ఎందరో జాతీయ ఉత్తమ దర్శకులతో సినిమాలు నిర్మించేలా చేశారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం చాలాకాలం పాటు నిర్మాణానికి నోచుకోకుండా ఉన్న దశలో డి.వి.ఎస్‌.రాజు చొరవతో అది అంతర్జాతీయ సినిమాగా రూపుదిద్దుకోవడం విశేషం. 1980లో హైదరాబాద్‌లో ఫిల్మోత్సవాన్ని తన హయాంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. డీవీయస్‌ రాజు పార్ధీవ దేహానికి చిత్ర ప్రముఖులు నివాళులు అర్పించారు.

dvs-raju1
ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో డీవీఎస్‌ రాజు భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో అక్కినేని నాగేశ్వర రావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రామోజీరావు, చిరంజీవి, అల్లు అరవింద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కైకాల సత్యనారాయణ, నిర్మాత అశోక్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, నటుడు, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.

ఎవరూ పూడ్చలేని లోటిది !
dvs-raju3 
మాకెంతో ఆత్మీయుడు మా కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. నాన్నగారితో సుదీర్ఘకాలం అనుబంధాన్ని కొనసాగించారు. నిర్మాతగా నాన్నగారితో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. పరిశ్రమలో అందరికీ ఆప్తుడుగా, మనసున్న మనిషిగా అందరి హృదయాల్నీ గెల్చుకున్న ఆయన మరణం అందరికీ బాధాకరం. - బాలకృష్ణ  
 

డి.వి.ఎస్‌.రాజుతో నాకెంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే మంచి మనసున్న వ్యక్తి.
-డాఅక్కినేని నాగేశ్వరరావు

పరిశ్రమలో అందరి ఉన్నతిని కాంక్షిస్తూ..ఆజాత శత్రువుగా నిలిచిన వ్యక్తి డి.వి.ఎస్‌.రాజు. నేను పరిశ్రమలోకి రావడానికి ఆ రోజుల్లో ఎంతో ప్రోత్సాహమిచ్చారు.
-డాదాసరి నారాయణరావు

చలన చిత్ర పరిశ్రమకు ఎన్నో సలహాలిచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి డి.వి. ఎస్‌.రాజు. ఆయన విలువైన సలహాలు చలన చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించాయి.
-డాడి.రామానాయుడు


dvs-raju 
ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే గొప్ప మనసున్న వ్యక్తి డి.వి.ఎస్‌.రాజు. మద్రాస్‌ లో నటశిక్షణలో ప్రవేశించినప్పుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.
-చిరంజీవి

మనసున్న మనిషి రాజుతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే మనసున్న మనిషి. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.- అక్కినేని నాగేశ్వరరావు 

అందరికీ ఆప్తుడు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ముందుండి దాని పరిష్కారానికి చొరవ తీసుకునేవారు. ఆయనిచ్చిన సలహాలు పరిశ్రమకి ఎంతో ఉపకరించాయి. అందరికీ ఆప్తుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. - డాక్టర్ డి. రామానాయుడు 

అజాతశత్రువు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డి.వి.ఎస్. రాజు చేసిన సేవలు ఎనలేనివి. నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఆయన ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. పరిశ్రమలో అందరి ఉన్నతిని కాంక్షిస్తూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన లేని లోటు పూడ్చలేనిది.  - దాసరి నారాయణరావు

నాలాంటి వాళ్లకు స్ఫూర్తి మద్రాసులో నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన కొత్తలో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రతిభకు విలువనిచ్చి ప్రోత్సహించే గొప్ప మనసు ఆయన సొంతం. నాలాంటి వాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతి పరిశ్రకు తీరని లోటు.- చిరంజీవి 


భారతీయ సినిమాకి సేవ ఆయనతో మా కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఉంది. మా నాన్నగారికి ఎంతో సన్నిహితులు. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరపురాని సేవలందించారు. ఇటీవల ఆయన కుమారుడి మరణం ఆయన్నెంతో కుంగదీసింది. చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. - అల్లు అరవింద్ 

పేరమ్మని నేనే రాజుగారు నిర్మించిన 'ప్రెసిడెంటు పేరమ్మ' చిత్రంలో నేను కథానాయికగా నటించా. ఎప్పుడు కనిపించినా 'పేరమ్మా' అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆ పిలుపు ఇంక వినలేనని తెలిసి హృదయం భారమవుతోంది. - కవిత 

ఆద్యుడు ఆయనే - రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు కృషిచేసిన వ్యక్తుల్లో రాజుగారు ప్రముఖులు. 1978లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే. తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాకి చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాల్నీ, గౌరవాల్నీ ఆయన అందుకున్నారు. ఆయన కృషి మూలంగానే సౌంత్ ఇండియన్ ఫిల్మ్‌చాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటై ఎంతోమంది పేరుపొందిన సినీ కళాకారుల్ని తయారుచేసింది.

భారతదేశపు అత్యున్నత సినిమా సంస్థ నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి.)కు తొలి ఛైర్మన్ రాజుగారే. రెండు సార్లు ఆ పదవిలో కొనసాగి, దానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలందుకున్న 'గాంధీ' చిత్రాన్ని సర్ రిచర్డ్ అటెన్‌బరోతో కలిసి ఎన్.ఎఫ్.డి.సి. నిర్మించింది ఆయన హయాంలోనే. అదే సంస్థలో సినీ కళాకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది కూడా ఆయన ఆధ్వర్యంలోనే కావడం గమనార్హం. ఆయన మరణంతో భారతీయ సినిమా ఓ ధృవతారని కోల్పోయింది. 
-కె. రామసుబ్బారెడ్డి, ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు. 

పరిశ్రమ తరలింపులో ప్రముఖ వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి కృషి చేసిన వ్యక్తుల్లో రాజుగారు ప్రముఖులు. పరిశ్రమలోని వ్యక్తులకు సేవ చేసేందుకు, వారు సేద తీరేందుకు ఉద్దేశించిన ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సి.సి.) ప్రారంభమైంది ఆయన ఆధ్వర్యంలోనే. ఆయన లేని లోటు ఏనాటికీ తీరనిది.  
                                                                                                                          -ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులు